47
ఫిలిప్తీయుల గురించిన సందేశం 
 1 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది. 
 2 యెహోవా ఇలా చెపుతున్నాడు, 
“చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. 
శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. 
దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. 
వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు. 
 3 పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు. 
రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు. 
తండ్రులు తమ పిల్లలను రక్షణ కల్పించలేరు. 
ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు. 
 4 ఫిలిష్తీయులనందరినీ యెహోవా 
త్వరలో నాశనం చేస్తాడు! 
తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన 
వారందరినీ నాశనం చేస్తాడు. 
ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు. 
క్రేతు* క్రేతు “కఫోరు” ద్వీపమని దీని శబ్దార్థం. దీన్ని కొన్ని సార్లు క్రేతు అని, మరికొన్ని సార్లు కుప్ర అని అనటం కద్దు. బైబిలు ప్రకారం ఫిలిష్తీయులు ప్రథమంగా కఫ్తోరునుండి వచ్చారు. ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు. 
 5 గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు. 
ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది. 
లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?† ఎంతకాలం … గాయపర్చుకుంటారు తమ విచారాన్ని సూచించేందుకు ప్రజలు తమ శరీరాలను చీరుకొని గాయపర్చుకునేవారు. 
 6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు. 
నీ ఒరలోనికి నీవు వెళ్లుము! 
ఆగిపో! శాంతించు, అని మీరంటారు. 
 7 కాని యెహోవా ఖడ్గం ఏ విధంగావిశ్రాంతి తీసికుంటుంది? 
యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 
అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని 
ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”